అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించడం లేదు ?
కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఒక సంవత్సరానికి సుమారుగా 30 లక్షల కోట్లు లేదా 30 శంఖులు (ఒక శంఖు शङ्कु అంటే 1 లక్ష కోట్లు. 10 పవర్ 12). ఖర్చు 33 లక్షల కోట్లు లేదా శంఖులు (10% fiscal deficit లేదా లోటు బడ్జెట్ మనది).
పెట్రోలియం మీద కేంద్రానికి 3 శంఖుల ఆదాయం సంవత్సరానికి. 6 శంఖులు కార్పోరేట్ ఆదాయ పన్నులు, 6 శంఖులు వ్యక్తిగత ఆదాయ పన్నులు, 7 శంఖుల GST, 1.5 శంఖులు కస్టమ్స్, మిగతావి అప్పులు, ఇతరత్రా ఆదాయం. మొత్తం సుమారుగా 30 శంఖులు.
పెట్రోలియం మీద సుంకాలు తగ్గించాలంటే…
మనకు 30 శంఖుల ఆదాయం. 35 శంఖుల ఖర్చులు. ఒకటి ఆదాయం పెంచుకోవాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలి.
కేంద్ర ఉద్యోగాలలో కోతలు పెట్టాలి, సబ్సిడీలు తగ్గించాలి, రైతులు MSP లు తీసివేయాలి, విద్య, వైద్యం, రోడ్లు, నీళ్ళు లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కోత పెట్టాలి.
కార్పోరేట్ ఆదాయ పన్నులు - ఇక్కడ పన్నులను పెంచితే, లాభాలు పడిపోయి, కంపెనీలు పారిపోతాయు లేదా ఉద్యోగాలు తొలగిస్తాయి.
వ్యక్తిగత ఆదాయ పన్నులు - నూటికి కట్టేదే ఐదుగురు. 5%. వీళ్ళనే మళ్ళా ఏం పిండుతాం ? మధ్య తరగతి పాపం.
లేదా GST పెంచాలి. ఉప్పు మీద, పప్పు మీద పన్ను వేసారు అని రచ్చ రంభోళా చేస్తారు. శానిటరీ నాప్కిన్ ల మీద పన్ను ఉంటే గొడవ గొడవ చేసి దాన్ని సున్నా GST కి తెచ్చేదాక నిద్రపోలేదు మనోళ్ళు.
సబ్సీడులు ఇవ్వాలి, రైతులకు MSP ఇవ్వాలి, బీదలకు రూపాయకు బియ్యం ఇవ్వాలి. తగ్గిస్తాం అంటే ఢిల్లీలో రైతుల గొడవ చూడండి.
పోనీ నష్టాల్లో ఉన్న బ్యాంకులు, పరిశ్రమలు అమ్ముదాం అంటే ఒప్పుకోరు. విశాఖ ఉక్కు రగడ చూడండి.
మళ్ళా Expressways, Bullet Trains కావాలి. అభివృద్ధి కావాలి, అందమైన రోడ్లు కావాలి.
ఉచిత విద్యుత్ కావాలి, ఉచిత నీళ్ళు కావాలి. పన్నులు మాత్రం కట్టం, మా దేశం అమెరికాలా అందంగా తయారవ్వాలి ? ఎలా సాధ్యం?
పెట్రోలియం మీద పన్నులు
మన క్రూడ్ దిగుమతులు 85% ఉన్నాయి, ఇంధనంపై పన్నులను తగ్గించడం మంచి ఆలోచన కాదు.
1. ఒకవేళ ఆయిల్ చౌకగా ఉన్నట్లయితే, డిమాండ్ పెరుగుతుంది దాంతో మరింత ఆయిల్ ని దిగుమతి చేసుకోవాలి. దెబ్బకు మన ఫారెక్స్ డాలర్లను తినేలా చేస్తుంది.
2. అధిక చమురు ధరలు వినియోగాన్ని తగ్గిస్తాయి మరియు పర్యావరణాన్ని ఆదా చేస్తుంది. తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడతాయి.
3. అధిక పెట్రోలియం ధరలు పునరుత్పాదక ఇంధన వనరులలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం కలిపిస్తాయి. ఎలక్ట్రిక్ కార్లు చౌకగా కనిపిస్తాయి. గ్యాసు, సోలార్ మీద పెట్టుబడులు పెరుగుతాయి.
పెట్రోలియం ఎంత భారం ప్రజలకు ?
రోజూ 50 కిలోమీటర్లు బండిమీద తిరిగితే ఒక లీటరు పెట్రోలు కావాలి. అంటే పది రూపాయలు ఎక్కువ అయింది. నెలకు 300 పెరిగింది. కారు ఉన్నవాళ్లకు 50 రూపాయలు (5 లీటర్లు )రోజుకు, 7 నుండి 20 లక్షల కారు కొన్నవాళ్ళుకు 1500 పెరిగింది. నా దృష్టిలో ఈమాత్రం ప్రజలు కట్టగలరు.
గత ప్రభుత్వాలు ఆయిల్ బాండులు (అప్పులు) జారీ చేసి, పెట్రోలు చవకగా ఇచ్చారు. మనం కాకపోతే మన పిల్లలు కట్టాలి అవి.
ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. మీకు ఏదైనా ఉచితంగా వచ్చింది అంటే, పాపం దానికి ఎవరో డబ్బు చెల్లించారు ఎక్కడో!
Comments
Post a Comment