Skip to main content

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సమంజసం ? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేట్ పరం చేస్తుందా ?

విశాఖ స్టీల్ ను ప్రైవేటు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రయత్నం.

దీనిని మనమందరం ఓపెన్ హార్ట్ తో స్వాగతం పలకాలి, ఎందుకంటే ఇది చాలా మంచి చర్య.

ఎందుకంటే ముందర ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ?

సంస్ధ యజమాని ఎవరు? సంబంధిత మంత్రి. ఆయన ఒక రాజకీయ నాయకుడు.

ఎవరు కంపెనీ నడుపుతున్నారు ? కొందరు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు.వీళ్ళకు వ్యాపారనుభవం సున్న.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు: ఉద్యోగం పోతుందనే భయం లేదు, కంపెనీకి నష్టాలొచ్చినా వీళ్ళ జీతాలకు ఢోకాలేదు. పదవీవిరమణ వరకు జీతం గారెంటీ, ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే పని చేసినా చేయకపోయినా జీవితాంతం జీతం.

కంపెనీకి నష్టాలు వస్తే డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన పన్నుల నుండే.ప్రజలు కష్టం నుండి.

ఒక మంత్రి, కొద్దిమంది ఐఏఎస్ లు మరియు కొంతమంది అదృష్టవంతమైన ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది? మనలో చాలామందికి తెలుసు. ఎలా గవర్నమెంట్ జాబ్ పొందాలో, ఎంత ఖర్చు అవుతుందో, అవినీతికి మూలస్తంభం)

పైన ఉదహరించిన వాళ్ళలో ఎవరైనా కంపెనీలో సింగిల్ పైసా పెట్టుబడి పెట్టారా ? ప్రజల పన్నుల డబ్బు మాత్రమే ఉంది అక్కడ. ఒకవేళ నష్టం వస్తే మంత్రి, మేనేజ్ మెంట్ లేదా ఉద్యోగులకు ఏమైనా నష్టం జరుగుతుందా? పిసరంత నష్టం కూడా లేదు. నష్టాలొచ్చినా ప్రమోషన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్లు, నెలవారీ జీతాలకు ఢోకానే లేదు.

మంత్రి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని కావలసినంత అవినీతి చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. తన కు కావలసిన వాళ్ళకి లేదా లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వవచ్చు. ఇంకా స్నేహితులకు కాంట్రాక్ట్ లు మరియు కమిషన్ లు పొందుతారు. సంస్ధ ఒక కామధేనువు.

ఈ అదృష్టవంతులు అందరూ కేవలం ప్రభుత్వ సంస్ధ పేరు మీద సామాన్యుల రక్తాన్ని పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేసి ఆనందిస్తున్నారు. ఎవరికీ భాద్యత లేదు, భయం లేదు.

పరిష్కారం:

ఈ చెత్తంతా ప్రైవేటైజేషన్ ద్వారా శుభ్రం చేయబడుతుంది. ఇప్పడు ప్రైవేటు వ్యక్తులు తమ స్వంత డబ్బును పెట్టుబడి పెడతారు మరియు

కంపెనీ రన్ చేస్తారు. నష్టాలకు ఇప్పుడు యాజమాన్యం బాధ్యత వహిస్తుంది, ఉద్యోగులు తమ భవిష్యత్తు గురించి భయపడుతారు. పని చేస్తారు. యజమానులు దానిని లాభదాయకంగా చేయడానికి ప్రయత్నిస్తారు, లేనిపక్షంలో వారి పెట్టుబడులు పోతాయి.

ప్రజలకు ఏ వ్యవస్థ కావాలి?

ఎలాంటి జవాబుదారీతనం, బాధ్యత లేకుండా కంపెనీ పబ్లిక్ డబ్బుతో రిస్క్ లేకుండా నడపటమా? లేదా

స్వంత డబ్బుతో రిస్క్ తీసుకోని నడపటమా ?

భారత ప్రజలైన మనకి ఏం కావాలో నిర్ణయం తీసుకోవాలి ఇప్పడు. పన్నులతో కంపెనీలా? రోడ్డు, నీళ్ళు, విద్య, వైద్యమా ?

ప్రభుత్వ ధర్మం, వ్యాపారాలు చేయడం కాదు. పరిపాలన చేయడం.

వ్యాపారాలు, స్వంత డబ్బుతో, భాగస్వాముల ద్వారా చేయాలి.

వైజాగ్ స్టీల్ ప్రైవేట్ మేనేజ్ మెంట్ కు వెళ్లి అద్భుతమైన, సూపర్ కంపెనీగా తీర్చిదిద్దుతుంది.

వీరు ఖచ్చితంగా బద్ధక, అవినీతి ఉద్యోగులను మరియు నిరుపయోగమైన మేనేజ్ మెంట్ ని తోలు వలిచి పని చేపించి లాభాల్లోకి తీసుకుని వస్తారు.

ప్రైవేటీకరణ కు సంబంధించిన ఈ చర్యకు భారత పౌరులు మద్దతు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం బహిరంగ వేలంలో వెళుతుంది, కాబట్టి అమ్మడంలో అవినీతి కి గురి కాదు. ఎవరైనా వేలంలో పాల్గొని డబ్బు ఉంటే కంపెనీని కొనుగోలు చేయవచ్చు.

మోదీ ఆద్వర్యంలోని కేంద్రప్రభుత్వం అవినీతిరహిత ప్రభుత్వం. పారదర్శకంగా అమ్ముతారు. వచ్చిన డబ్బుతో చాలా సులభంగా వైజాగ్ కు మెట్రో లాంటి ప్రజోపయుగమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు.

——-

భారత ప్రభుత్వ మెడమీద 250+ కంపెనీలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం చక్కగా చెప్పింది. 24 మాత్రం ఉంచి మిగతావిఅన్నీ వదిలించుకుంటామని. కావున ఒకటి ముందర ఒకటి వెనక అవ్వచ్చేమో కానీ అన్నిటికి మంగళం పాడటం గారెంటీ.

పరిపాలన మాత్రమే ప్రభుత్వ విధి. వ్యాపారం ప్రైవేటువాళ్ల విధి. సేవ రాజకీయవిధి.

We want Minimum Government Maximum Goveranance.

ఈ కంపనీల దరిద్రం పోతే, కేంద్రంలో సగం మంత్రిత్వశాఖలు మూతపడి, రాజకీయం లాభదాయకం కాక రాజకీయ అవినీతి కూడా తగ్గిపోతుంది. వ్యాపార దృక్పథం ఉన్న రాజకీయనాయకులు వ్యాపారాలు చేసుకుంటారు. సేవా దృక్పథం ఉన్నోళ్లు మాత్రం రాజకీయాల్లో మిగులుతారు. దేశానికి శుభపరిణామం.

జైహింద్

Comments

  1. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు ప్రవేటికరణ చేస్తున్నారు ఇది అభివృద్ధి కోసం కాదు కేవలం కొంత మంది కార్పొరేట్ సంస్థలకు కారుచావు గా అమ్మేసి మరల వారికే మాఫీ చేస్తున్నారు ఇది BJP చేస్తున్న పెద్ద కుంభకోణం

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం

రాహుకాలం ,  వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం వారాల క్రమ పద్దతి మన శాస్త్రాల ప్రకారం మనకి మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. మనవాళ్ళు చంద్ర, సూర్యలను కూడా గ్రహాల క్రిందే లెక్క కట్టారు. రాహూ, కేతు ఛాయాగ్రహాలు కావున వాటిని తీసివేస్తే మిగిలిన 7 గ్రహాల పేర్ల మీద మనకి 7 వారాలు వచ్చాయి. ఈ పేర్ల క్రమం ఎలా వచ్చిందో చూద్దాం . దీని వెనక ఉన్న తర్కం చూద్దాం 7 గ్రహాల క్రమం మనం ఒక పద్దతి ప్రకారం చూస్తే …. దూరం పరిమాణం గ్రహ భ్రమణ వేగం ఒక Astronomical Units (Au) అంటే భూమికి, సూర్యునికి మధ్య దూరం, 15,00,00,000 (15 కోట్లు) కిలోమీటర్లు. ఒక Lunar Distance (LD) అంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం, 3,85,000 (3 లక్షల, 85 వేల) కిలోమీటర్లు. క్ర . సం . గ్రహ - దూరం గ్రహ పరిమాణం గ్రహ భ్రమణ వేగం తెలుగు English చంద్ర సూర్య గ్రహం Kms భూమితో గ్రహం వేగం 1 చంద్ర Moon 1 O.oo25 చంద్ర 1,737 27% చంద్ర 27 రో 2 శుక్ర Venus 108 O.28 బుధ 2,440 38% బుధ 88 రో 3 మంగళ Mars 202 O.52 మంగళ ...

హిందూ క్యాలెండర్ & పంచాంగం

హిందూ క్యాలెండర్ , పంచాంగం భారత ప్రజల కాల గణన క్యాలెండర్ అనేది సమయాన్ని లెక్కించడానికి , రుతువులను ట్రాక్ చేయడానికి మరియు పండగలను నిర్వహించడానికి ఇంకా పుట్టినరోజు , వివాహ దినోత్సవం మొదలైన రోజువారీ జీవితంలో ముఖ్యమైన తేదీలను జరుపుకోవడానికి ఉపయోగిస్తారు . ఇండియన్ క్యాలెండర్ అనేది చంద్ర మరియు సౌర చలనం ఆధారంగా రూపొందించబడింది . ఈ క్యాలెండర్ ను భారత ఉపఖండం , కంబోడియా , మలేషియా , లావోస్ మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు . శకం లేదా  క్యాలెండర్ ప్రారంభం ప్రతి క్యాలెండర్ కు నిర్దిష్టమైన ఒక రిఫరెన్స్ సంవత్సరం ఉంటుంది , సమయం లెక్కించడానికి . క్రిస్టియన్ లేదా కాథలిక్ చర్చి అధ్యక్షుడైన పోప్ గ్రెగరీ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత సంవత్సరం 2020 . ఈ 2020 యేసుక్రీస్తు తరువాత 2020 సంవత్సరాలు గడిచిపోయాయని సూచిస్తుంది . ఇస్లామిక్ కేలండర్ లో మొదటి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త ( 622 ) తో మొదలై ప్రస్తుత సంవత్సరం వారికి 1442 కింద నడుస్తుంది . అదేవిధంగా ఒక గొప్ప సంఘటన నుంచి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయ...

Hindu Calendar and Panchanga

Hindu Calendar, Panchangam Time Measurement by Bharathiya People Any Calendar is to measure time, to track seasons and to conduct festivals and celebrate important dates in a day to day life like birthday, marriage day etc. Indian Calendar is based on lunar & solar movement. This calendar is used in Indian subcontinent, Cambodia, Malaysia, Laos and in many other places around the world Year or Samvat Every calendar got a reference year to measure time, Present year is  2020  according to Christian or Pope Gregory of Catholic Church Calendar. This 2020 refers that these many years have passed after Jesus Christ. In Islamic Calendar the first year started with Prophet Mohammad (622 AD) and present year is  1442  for them. Similarly we got 3 reference points to measure number of years passed from a great event for us. Saka Samvat This reference is from the date of Shalivana or Saka Kingdom started ruling Bharath. This started from the year  78 AD  of Chris...