Skip to main content

భారతదేశం ఎందుకు వెనుకబడింది ?

సామ్యవాదం అసలైన కారణం

మనకి స్వాతంత్ర్యం వచ్చాక సామ్యవాదాన్ని (socialism) అనుసరించటం.

ప్రపంచంలో సామ్యవాదాన్ని అనుసరించి బాగుపడిన దేశం ఒక్కటి కూడా లేదు.

మనం ఉత్తర కొరియా, దక్షిణ కొరియూ లని తీసుకంటే దక్షిణ కొరియా స్వేచ్చా వాణిజ్యం (free market economy) విధానాన్ని అనుసరించి అధ్భుత ప్రగతి సాధించింది, ఉత్తర కొరియా సామ్యవాదాన్ని అనుసరించి బీదరికంలోకి జారిపోయింది.

ఇంకా తూర్పు జర్మని, పశ్చిమ జర్మని లని తీసుకుంటే పశ్చిమ జర్మని స్వేచ్చా వాణిజ్యంతో ఉన్నత స్థితికి వెళితే, తూర్పు జర్మని సామ్యవాదంతో సర్వనాశనం అయిపోయింది.

అణుబాంబులతో సర్వనాశనం అయిన జపాన్ 50 ఏళ్ళలో ధనికదేశం అయిపోయింది. వీళ్ళు కూడా స్వేచ్చా వాణిజ్య విధానంలో పైకి వచ్చారు.

ప్రస్తుతానికి వస్తే వెనిజులా దగ్గర అధ్భుతమైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నా సామ్యవాదాన్ని నమ్ముకొని ఎంత ఘోరంగా నాశనం అయిపోయందో మనం చూడొచ్చు.

సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలు, చైనా (1978 వరకు) ఆర్ధికంగా దిగజారిపోయాయి ఈ సామ్యవాద మత్తులో పడి.

మొత్తానికి ఆర్ధిక స్వేచ్చ లేని, సామ్యవాదాన్ని మాత్రమే నమ్ముకొని బాగుపడిన దేశం కానీ, సమాజం కానీ, ఒక జాతి కానీ లేవు ఈ భూమ్మీద.

మన భారతదేశానికి వస్తే, స్వాతంత్ర్యం సిద్దించాక, మన నాయకులు సామ్యవాద ఆర్దిక విధానం అనుసరించారు 1991 వరకు. మహానుభావుడు పి.వి.నరసింహారావు గారు వచ్చి మనల్ని స్వేచ్చా వాణిజ్యం వైపు దారి మళ్లించి భారతజాతిని రక్షించాడు.

1947 - 1991 మన తలసరి ఆదాయం 1.3% చొప్పున మాత్రమే అభివృద్ధి చెందింది. దీన్నే ప్రపంచదేశాలు హిందూ వృద్దిరేటు[1] అని ఎగతాళి చేసేవారు.

1991 వరకు మనం ప్రైవేటు పెట్టుబడులను నిరుత్సాహపరిచే వాళ్ళం, విదేశీ పెట్టుబడులకు తలుపులు మూసివేశాం. లాభం సంపాదించాలి అంటే పాపంలా చూసేవాళ్ళం. సర్వం ప్రభుత్వమయం. వ్యనస్తలో పోటీతత్వం అనేదీ లేదు మనకు, అంతా సహకారమే, చివరకు ఉత్పత్తి శూన్యం.

చైనా 1978 లో మావో మరణించాక, డెంగ్ జియోపింగ్ (deng xioping) నాయకత్వంలో స్వేచ్చా వాణిజ్యపద్దతికి మారి అధ్భుత ప్రగతిపదంలో దూసుకొని పోతోంది. మనం 1991 లో దారి మార్చాం. 13 ఏళ్ళ అంతరం ఉంది రెండు దేశాల మధ్య. ఆ తేడా ఇంకా కొనసాగుతుంది ఈ రోజుకి కూడా.

1978 లో చైనా, భారత్ GDP సమానం, 2020 లో భారత్ 3 ట్రిలియన్లు ఉంటే చైనా 15 ట్రిలియన్లు. 5 రెట్లు పెద్దది.

13 ఏళ్ళ క్రితం (2007) లో చైనా ఆర్ధిక శక్తి 3 ట్రిలియన్లు. 13 ఏళ్ళ క్రితం చైనా ఎక్కడ ఉందో మనం ఇప్పుడు 2020 లో సేమ్ పొజిషన్లో ఉన్నాం.

ధనం రెట్టింపు అవడానికి సాదారణంగా 6 నుండి 7 ఏళ్ళు పడుతుంది. 3 నుండి 6 అవటానికి 6 ఏళ్ళు, 6 నుండి 12 అవటానికి ఇంకో 6 ఏళ్ళు మొత్తం 12 ఏళ్ళలో మన భారతం 12 ట్రిలియన్లు, 2040 వచ్చేసరికి దగ్గర దగ్గరగా 40–50 ట్రిలియన్లకి చేరుకొని ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకొన తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది.

చరిత్రలోకి చూస్తే ఏ సమయంలో అయినా, ప్రపంచం మొత్తం మీద చూస్తే 25% జనాభా మరియు సంపద మన భారత దేశంలోనే ఉండేది. ఈ రోజున కూడా ప్రపంచంలో వ్యవసాయ భూమి పరంగా (Aerable Land)[2] మనమే అతి పెద్ద దేశం, అధ్భుతమైన భూమి, ఖనిజ సంపద, మేధస్సు, విఙ్నానం మన సొంతం.

2020 లో జనాభా 25% జనాభా మనదే. సంపద మాత్రం 3%. మనం తొందరలో మళ్లా 25% సంపదకి చేరుకుంటాం, మళ్లా ధనికదేశం అవుతాం. సందేహం లేదు.

Comments

Popular posts from this blog

రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం

రాహుకాలం ,  వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం వారాల క్రమ పద్దతి మన శాస్త్రాల ప్రకారం మనకి మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. మనవాళ్ళు చంద్ర, సూర్యలను కూడా గ్రహాల క్రిందే లెక్క కట్టారు. రాహూ, కేతు ఛాయాగ్రహాలు కావున వాటిని తీసివేస్తే మిగిలిన 7 గ్రహాల పేర్ల మీద మనకి 7 వారాలు వచ్చాయి. ఈ పేర్ల క్రమం ఎలా వచ్చిందో చూద్దాం . దీని వెనక ఉన్న తర్కం చూద్దాం 7 గ్రహాల క్రమం మనం ఒక పద్దతి ప్రకారం చూస్తే …. దూరం పరిమాణం గ్రహ భ్రమణ వేగం ఒక Astronomical Units (Au) అంటే భూమికి, సూర్యునికి మధ్య దూరం, 15,00,00,000 (15 కోట్లు) కిలోమీటర్లు. ఒక Lunar Distance (LD) అంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం, 3,85,000 (3 లక్షల, 85 వేల) కిలోమీటర్లు. క్ర . సం . గ్రహ - దూరం గ్రహ పరిమాణం గ్రహ భ్రమణ వేగం తెలుగు English చంద్ర సూర్య గ్రహం Kms భూమితో గ్రహం వేగం 1 చంద్ర Moon 1 O.oo25 చంద్ర 1,737 27% చంద్ర 27 రో 2 శుక్ర Venus 108 O.28 బుధ 2,440 38% బుధ 88 రో 3 మంగళ Mars 202 O.52 మంగళ ...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సమంజసం ? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేట్ పరం చేస్తుందా ?

విశాఖ స్టీల్ ను ప్రైవేటు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రయత్నం. దీనిని మనమందరం ఓపెన్ హార్ట్ తో స్వాగతం పలకాలి, ఎందుకంటే ఇది చాలా మంచి చర్య. ఎందుకంటే ముందర ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ? సంస్ధ యజమాని ఎవరు? సంబంధిత మంత్రి. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఎవరు కంపెనీ నడుపుతున్నారు ? కొందరు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు.వీళ్ళకు వ్యాపారనుభవం సున్న. ఇక ప్రభుత్వ ఉద్యోగులు: ఉద్యోగం పోతుందనే భయం లేదు, కంపెనీకి నష్టాలొచ్చినా వీళ్ళ జీతాలకు ఢోకాలేదు. పదవీవిరమణ వరకు జీతం గారెంటీ, ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే పని చేసినా చేయకపోయినా జీవితాంతం జీతం. కంపెనీకి నష్టాలు వస్తే డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన పన్నుల నుండే.ప్రజలు కష్టం నుండి. ఒక మంత్రి, కొద్దిమంది ఐఏఎస్ లు మరియు కొంతమంది అదృష్టవంతమైన ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది? మనలో చాలామందికి తెలుసు. ఎలా గవర్నమెంట్ జాబ్ పొందాలో, ఎంత ఖర్చు అవుతుందో, అవినీతికి మూలస్తంభం) పైన ఉదహరించిన వాళ్ళలో ఎవరైనా కంపెనీలో సింగిల్ పైసా పెట్టుబడి పెట్టారా ? ప్రజల పన్నుల డబ్బు మాత్రమే ఉంది అక్కడ. ఒకవేళ నష్టం వస్తే మంత్రి, మేనేజ్ మెంట్ లేదా ఉద్యోగులకు ఏమై...