Skip to main content

క్రికెట్ ఎందుకు ఇంతగా ఆదరించడింది భారత్ లో !

ముఖ్య కారణం. క్రికెట్ క్రీడా పరిపాలన ప్రైవేటు అజమాయిషీలో ఉండటం. మిగతా క్రీడల పరిపాలన అంతా ప్రభుత్వ అజమాయిషీలో ఉండటం.


భారత్ లో క్రీడలు అన్నీ (IOC) భారతీయ ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. క్రీడలను రెండు రకాలుగా విభజించారు మనకి.

  1. ఒలంపిక్ క్రీడలు
  2. ఇతర గుర్తింపు పొందిన (నాన్-ఒలింపిక్) క్రీడలు

ప్రతి ఒలింపిక్ మరియు నాన్-ఒలింపిక్ క్రీడలకు ఒక జాతీయ క్రీడా సమాఖ్య (National Sports Federation (NSF)) ఉండి, ఆ క్రీడలను పరిపాలిస్తుంది. NSF లు మెత్తం 56 ఉన్నాయి మనకు. ఇవి అన్నీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అధ్వాన్నంగా నడుస్తాయి. అన్నీ రాజకీయనాయకుల కసుసన్నల్లో, ప్రభుత్వ అధికారుల చేతుల్లో నడుస్తాయి. అందరి లక్ష్యం ఒకటే ఉన్నన్ని రోజులు దొరికినంత దోచుకోవటం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం.

ఇంక క్రీడాభివృద్ది అంటే ఈ సమాఖ్యల్లో చాలా మందికి అర్ధం కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ఆటగాళ్లకి కసి ఉండదు, ఉద్యోగ భద్రత కావాలి అందరికి, ప్రజల ధనంతో అంతా బతికేస్తారు, ఎవరూ పైసా పెట్టుబడి పెట్టరు, ఎవరికీ జవాబుదారీతనం ఉండదు. పని చేసినా, చేయకపోయినా ప్రజల పన్నులనుండి జీతాలు, పెట్టుబడులు వస్తాయి. గెలిచినా, గెలవకపోయినా ఏమవదు, ఎవరేమనరు. వీళ్ళ కధ ఇది.

క్రికెట్

భారతీయుల అదృష్టమో, దురదృష్టమో ఒక క్రీడకి భారత ప్రభుత్వం నుండి ప్రధాన మినహాయింపు లభించింది. అదే మన క్రికెట్. NSF లేదు.

క్రికెట్ కి కొంత పోటీ ఇవ్వగలిగిన క్రీడలు హాకీ, పుట్ బాల్, టెన్నిస్, బాడ్మింటన్… ఇవి అన్నీ ప్రభుత్వ కభంద హస్తాలలో నలిగిపోతున్నాయి.

క్రికెట్ పరిపాలన సంస్ధ - Board of Control for Cricket in India(BCCI). ఇది పూర్తిగా స్వతంత్ర సంస్ధ, పూర్తిగా ప్రైవేటు సంస్ధ. భారత ప్రభుత్వ నీడకూడా పడని సంస్ధ.

BCCI జాతీయ సంస్ధ, దీనికి అన్ని రాష్ట్రాలలో కలిపి 38 సభ్యత్వ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులు కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి. BCCI భాధ్యత, క్రికెట్ క్రీడాభివృద్ది మరియు ధనార్జన, లాభం సంపాదించటం. రాష్ట్ర అసోసియేషన్ సభ్యత్వ రుసుము లక్షల్లో, కోట్లలో ఉంటుంది. stakes are high.

ఇప్పుడు బిసిసిఐ మరియు అధ్యక్షుడు మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి. వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డారు క్రికెట్ క్రీడాభివృద్దికి, 1980–90 లలో దూరదర్శన్ కి డబ్బులు కట్డి మరీప్రత్యక్ష ప్రసారం చేసి క్రీడని భారతీయుల ఇళ్లలోకి తీసుకొని వెళ్ళి మరీ క్రికెట్ ని అభివృద్ది చేసారు. ఆటగాళ్లకు మంచి జీతాలు, డబ్బు చెల్లించి, వెంటపడి మరీ స్పానర్ష్ లను తెచ్చుకున్నారు, ఉత్తమ ప్రతిభగల ఆటగాళ్లని నియమించుకున్నారు. అందరూ కలిసి అవసరమైన పెట్టుబడి పెట్టారు, వాళ్ల సొంత డబ్బు ఖర్చుపెట్టారు. ఇక్కడ అవినీతి లేదు, లక్ష్యం ఉంది, బంధుప్రీతి లేదు. కేవలం ఒకే ఒక లక్ష్యం క్రికెట్ క్రీడాభివృద్ది, పెట్టిన పెట్టుబడి మీద రాబడి. దీంతో క్రీడ అభివృద్ది చెందింది, క్రీడాకారులు బాగుపడ్డారు, ప్రజలకు నాణ్యమైన క్రీడ దొరికింది చూడటానికి.

ప్రజల ఆదరణ

ప్రజలు ఏ క్రీడలో భారత్ విజయం సాధిస్తుందో, ఆ క్రీడనే చూస్తారు, ఆస్వాదిస్తారు.క్రికెట్ కి పెట్టుబడులు ఉన్నాయి, నాణ్యమైన క్రీడాకారులు ఉన్నారు, భారత్ ని గెలిపించారు, ప్రజల మన్ననలు చూరగొన్నారు, ప్రభుత్వ క్రీడలు అన్నిచోట్లా ఓడిపోవటమే, మెల్లగా ప్రజల మన్నన, స్పాన్సర్లను కోల్పోయారు.. చివరలకి ఈ క్రీడా వ్యాపారంలో ప్రభుత్వ vs ప్రైవేటు మద్య జరిగిన జరుగుతున్న పోటీలో క్రికెట్ విజయం సాధించింది. ప్రజల ఆదరణ చూరగొన్నది.

భవిష్యత్తు చిత్రం

ఇప్పుడిప్ఫుడే మనకు, పుట్ బాల్, కబడ్డీ, బ్యాడింటన్ లలో ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి భవిష్యత్తులో ఇని కూడా మెల్లగా ప్రేక్షకాదరణ పొంది, క్రికెట్ కి తగిన పోటీ ఇస్తాయి.

భవిష్యత్తు లో భారత క్రీడాభిమానులకు మంచి మంచి నాణ్యమైన క్రీడలని చూసే అదృష్టం ఉంది. అతి తొందరలోనే క్రికెట్ గుత్తాధిపత్యం తొలగిపోయి అన్ని క్రీడలు పోటీ పడి వాటి వాటి క్రీడా వాటా అవి పొందుతాయి.


Comments

Popular posts from this blog

రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం

రాహుకాలం ,  వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం వారాల క్రమ పద్దతి మన శాస్త్రాల ప్రకారం మనకి మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. మనవాళ్ళు చంద్ర, సూర్యలను కూడా గ్రహాల క్రిందే లెక్క కట్టారు. రాహూ, కేతు ఛాయాగ్రహాలు కావున వాటిని తీసివేస్తే మిగిలిన 7 గ్రహాల పేర్ల మీద మనకి 7 వారాలు వచ్చాయి. ఈ పేర్ల క్రమం ఎలా వచ్చిందో చూద్దాం . దీని వెనక ఉన్న తర్కం చూద్దాం 7 గ్రహాల క్రమం మనం ఒక పద్దతి ప్రకారం చూస్తే …. దూరం పరిమాణం గ్రహ భ్రమణ వేగం ఒక Astronomical Units (Au) అంటే భూమికి, సూర్యునికి మధ్య దూరం, 15,00,00,000 (15 కోట్లు) కిలోమీటర్లు. ఒక Lunar Distance (LD) అంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం, 3,85,000 (3 లక్షల, 85 వేల) కిలోమీటర్లు. క్ర . సం . గ్రహ - దూరం గ్రహ పరిమాణం గ్రహ భ్రమణ వేగం తెలుగు English చంద్ర సూర్య గ్రహం Kms భూమితో గ్రహం వేగం 1 చంద్ర Moon 1 O.oo25 చంద్ర 1,737 27% చంద్ర 27 రో 2 శుక్ర Venus 108 O.28 బుధ 2,440 38% బుధ 88 రో 3 మంగళ Mars 202 O.52 మంగళ ...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సమంజసం ? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేట్ పరం చేస్తుందా ?

విశాఖ స్టీల్ ను ప్రైవేటు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రయత్నం. దీనిని మనమందరం ఓపెన్ హార్ట్ తో స్వాగతం పలకాలి, ఎందుకంటే ఇది చాలా మంచి చర్య. ఎందుకంటే ముందర ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ? సంస్ధ యజమాని ఎవరు? సంబంధిత మంత్రి. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఎవరు కంపెనీ నడుపుతున్నారు ? కొందరు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు.వీళ్ళకు వ్యాపారనుభవం సున్న. ఇక ప్రభుత్వ ఉద్యోగులు: ఉద్యోగం పోతుందనే భయం లేదు, కంపెనీకి నష్టాలొచ్చినా వీళ్ళ జీతాలకు ఢోకాలేదు. పదవీవిరమణ వరకు జీతం గారెంటీ, ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే పని చేసినా చేయకపోయినా జీవితాంతం జీతం. కంపెనీకి నష్టాలు వస్తే డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన పన్నుల నుండే.ప్రజలు కష్టం నుండి. ఒక మంత్రి, కొద్దిమంది ఐఏఎస్ లు మరియు కొంతమంది అదృష్టవంతమైన ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది? మనలో చాలామందికి తెలుసు. ఎలా గవర్నమెంట్ జాబ్ పొందాలో, ఎంత ఖర్చు అవుతుందో, అవినీతికి మూలస్తంభం) పైన ఉదహరించిన వాళ్ళలో ఎవరైనా కంపెనీలో సింగిల్ పైసా పెట్టుబడి పెట్టారా ? ప్రజల పన్నుల డబ్బు మాత్రమే ఉంది అక్కడ. ఒకవేళ నష్టం వస్తే మంత్రి, మేనేజ్ మెంట్ లేదా ఉద్యోగులకు ఏమై...

భారతదేశం ఎందుకు వెనుకబడింది ?

సామ్యవాదం అసలైన కారణం మనకి స్వాతంత్ర్యం వచ్చాక సామ్యవాదాన్ని (socialism) అనుసరించటం. ప్రపంచంలో సామ్యవాదాన్ని అనుసరించి బాగుపడిన దేశం ఒక్కటి కూడా లేదు. మనం ఉత్తర కొరియా, దక్షిణ కొరియూ లని తీసుకంటే దక్షిణ కొరియా స్వేచ్చా వాణిజ్యం (free market economy) విధానాన్ని అనుసరించి అధ్భుత ప్రగతి సాధించింది, ఉత్తర కొరియా సామ్యవాదాన్ని అనుసరించి బీదరికంలోకి జారిపోయింది. ఇంకా తూర్పు జర్మని, పశ్చిమ జర్మని లని తీసుకుంటే పశ్చిమ జర్మని స్వేచ్చా వాణిజ్యంతో ఉన్నత స్థితికి వెళితే, తూర్పు జర్మని సామ్యవాదంతో సర్వనాశనం అయిపోయింది. అణుబాంబులతో సర్వనాశనం అయిన జపాన్ 50 ఏళ్ళలో ధనికదేశం అయిపోయింది. వీళ్ళు కూడా స్వేచ్చా వాణిజ్య విధానంలో పైకి వచ్చారు. ప్రస్తుతానికి వస్తే వెనిజులా దగ్గర అధ్భుతమైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నా సామ్యవాదాన్ని నమ్ముకొని ఎంత ఘోరంగా నాశనం అయిపోయందో మనం చూడొచ్చు. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలు, చైనా (1978 వరకు) ఆర్ధికంగా దిగజారిపోయాయి ఈ సామ్యవాద మత్తులో పడి. మొత్తానికి ఆర్ధిక స్వేచ్చ లేని, సామ్యవాదాన్ని మాత్రమే నమ్ముకొని బాగుపడిన దేశం కానీ, సమాజం కానీ, ఒక జాతి కానీ లేవు ఈ భూమ్మీద. మన భారతదేశా...